సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో మహర్షి సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా ద్వారా వ్యవసాయం ఆవశ్యకతని దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పే ప్రయత్నం చేశాడు.
సోషల్ ఎలిమెంట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.మహర్షి తర్వాత మహేష్ బాబు కాస్తా ఫన్ కమర్షియల్ జోనర్ లోకి వచ్చి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మహేష్ బాబు స్టామినాని మరోసారి పరిచయం చేసింది.ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తాడనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తుంది.
అయితే మహేష్ మళ్ళీ వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఈ సినిమా గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల బట్టి వంశీతోనే సినిమా కన్ఫర్మ్ అయినట్లు టాక్.
ఇక ఇప్పటికే దర్శకుడు వంశీ మహేష్ కి స్టొరీ నెరేట్ చేయడం జరిగిందని, అతను ఒకే చెప్పడం కూడా జరిగిపోయిందని చెప్పుకుంటున్నారు.ఇక ఈ సినిమా కోసం టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ దర్శకుడు మణిశర్మని ఫైనల్ చేసినట్లు సమాచారం.
ఇస్మార్ట్ శంకర్ తో ట్రాక్ లో పడ్డ మణిశర్మ ప్రస్తుతం కొరటాల, మెగాస్టార్ కాంబినేషన్ తెరకెక్కుతున్న సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ నేపధ్యంలో మహేష్ సినిమాకి కూడా వంశీ మణిశర్మని తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.
మరి వంశీ-మహేష్ కాంబినేషన్ పై వస్తున్న వార్తలలో నిజమెంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.