టాలీవుడ్లో ఫ్యామిలీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఆ తరువాత మహేష్ బాబుతో చేసిన బ్రహ్మోత్సవం అట్టర్ ఫ్లాప్ మూవీగా నిలిచి శ్రీకాంత్ అడ్డాల కెరీర్ను డైలమాలో పడేసింది.
దీంతో ఆయన చాలా రోజులు కనిపించకుండా పోయారు.ఇప్పుడు మళ్లీ తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’ చిత్రాన్ని తెలుగులో ‘నారప్ప’ అనే టైటిల్తో రీమేక్ చేస్తూ పవర్ఫుల్ కమ్బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే నారప్ప సినిమా తరువాత శ్రీకాంత్ అడ్డాల మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు.గతంలో ముకుంద చిత్రంతో మెగా హీరో వరుణ్ తేజ్ను ఇంట్రొడ్యూస్ చేసిన అడ్డాల, మరోసారి ఈ కాంబోను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
వరుణ్ తేజ్ను హీరోగా పెట్టి ఓ అదిరిపోయే సినిమాను తెరకెక్కించేందుకు అడ్డాల ప్లాన్ చేస్తున్నాడట.అయితే ఈ సినిమాను 14 రీల్స్ ప్లజ్ బ్యానర్ వారు ప్రొడ్యూస్ చేయనున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.గతంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఎఫ్2 చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు వెంకటేష్తో నారప్ప చిత్రం చేస్తున్న అడ్డాల, ఆ తరువాత వరుణ్ తేజ్తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.మరి ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.