దాదాపుగా మూడేళ్ల కాలం పాటు గ్యాప్ తీసుకుని మళ్లీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్.అయితే వచ్చి రావడంతోనే వరుసపెట్టి సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో మళ్లీ తన మార్కెట్ ని బిల్డ్ చేసుకునే పనిలో పడ్డాడు.
అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నటువంటి లాయర్ సాబ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఓ పక్క పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటిస్తూనే మరో పక్క ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు.
ఈచిత్రానికి ప్రముఖ సినీ నిర్మాత ఏ.ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నట్లు పలు కథలు వినిపిస్తున్నాయి.అయితే పవన్ కళ్యాణ్ కి రెండో హీరోయిన్ గా ప్రభాస్ నటించిన టువంటి సాహో చిత్రంలో బ్యాడ్ బాయ్ సాంగ్ లో ఆడి పాడిన టువంటి ముద్దుగుమ్మ జాక్వలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్నట్లు సమాచారం.
అంతేగాక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరణ పూర్తి అయినట్లు తెలుస్తోంది.అయితే జాక్వలిన్ ఫెర్నాండేజ్ చివరిగా సల్మాన్ ఖాన్ నటించిన రేస్ 3 అనే చిత్రంలో నటించి మెప్పించింది.
అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ 2021వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.దీంతో సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ నటిస్తుండడంతో అప్పుడే దర్శకనిర్మాతలు వసూళ్ల పై అంచనాలు వేస్తున్నారు.