పవన్ కళ్యాణ్ రెండు రోజుల కర్నూలు టూర్ విజయవంతం అయ్యింది.నిన్న సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ ప్రభుత్వంకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన జనసేనాని నేడు పార్టీ కార్యకర్తలు మరియు నాయకులతో మాట్లాడటంతో పాటు స్థానిక రైతుల మరియు ప్రజల కష్టాలను ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
పవన్ పర్యటకు మంచి స్పందన రావడంతో కర్నూలు జిల్లా నాయకులు చాలా ఆనందంగా ఉన్నారు.కర్నూలు జిల్లాలో గతంతో పోల్చితే జనసేన బలం పెరిగినట్లుగా చెబుతున్నారు.
కర్నూలు జిల్లాలో వైకాపాకు పట్టు ఉన్న పలు నియోజక వర్గాల నుండి పవన్ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున జనాలు హాజరు అయ్యారు.దాంతో వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు.
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికులు సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్నారు.దాంతో పవన్ కళ్యాణ్ పర్యటన అందుకు మరింత బూస్ట్ ఇచ్చినట్లయ్యింది.
త్వరలోనే మళ్లీ జనసేన నాయకుడు పవన్ కర్నూలు వెళ్లబోతున్నాడు.అప్పుడు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారట.