పవన్‌ కర్నూలు టూర్‌తో జనసైనికుల్లో ఉత్సాహం

పవన్‌ కళ్యాణ్‌ రెండు రోజుల కర్నూలు టూర్‌ విజయవంతం అయ్యింది.నిన్న సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ ప్రభుత్వంకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన జనసేనాని నేడు పార్టీ కార్యకర్తలు మరియు నాయకులతో మాట్లాడటంతో పాటు స్థానిక రైతుల మరియు ప్రజల కష్టాలను ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

 Pawan Kalyan Kurnool Tour Active In Janasena Workers-TeluguStop.com

పవన్‌ పర్యటకు మంచి స్పందన రావడంతో కర్నూలు జిల్లా నాయకులు చాలా ఆనందంగా ఉన్నారు.కర్నూలు జిల్లాలో గతంతో పోల్చితే జనసేన బలం పెరిగినట్లుగా చెబుతున్నారు.

కర్నూలు జిల్లాలో వైకాపాకు పట్టు ఉన్న పలు నియోజక వర్గాల నుండి పవన్‌ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున జనాలు హాజరు అయ్యారు.దాంతో వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు.

ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికులు సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్నారు.దాంతో పవన్‌ కళ్యాణ్‌ పర్యటన అందుకు మరింత బూస్ట్‌ ఇచ్చినట్లయ్యింది.

త్వరలోనే మళ్లీ జనసేన నాయకుడు పవన్‌ కర్నూలు వెళ్లబోతున్నాడు.అప్పుడు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube