ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కాని అన్ని దేశాలకు అత్యంత విభిన్నంగా ఉత్తర కొరియా ఉంటుంది.అక్కడ పాలన కొనసాగిస్తున్న కిమ్ జోంగ్ నియంతృత్వ దోరణితో పాలన కొనసాగిస్తున్నాడు.
తాను ఏం చెబితే అదే సాగాలి.తాను ఏది అనుకుంటే అదే జరగాలి.
రాజులాగా అక్కడ ఆయన పాలన కొనసాగుతుంది.అభివృద్దికి ఆమడ దూరం ఉండటంతో పాటు, ప్రపంచ దేశాలతో శత్రుత్వంను కొని తెచ్చుకుంటున్నాడు.
తనకు అనుమానం అనిపిస్తే ఎంతటి వారినైనా చంపేస్తాడు.అలాంటి కిమ్ కరోనాపై ఎలా పోరాడుతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
చాలా మంది ఊహించినట్లుగానే ఎవరికైతే కరోనా వైరస్ ఉంది అనే అనుమానం కలిగినా కూడా వెంటనే వారిని చంపేసి అత్యంత జాగ్రత్తగా ఖననం చేయాలని ఆదేశిస్తున్నాడు.ఇదంతా కూడా తన దేశ ప్రజల బాగు కోసం అంటున్నాడు.
ఇటీవల ఉత్తరకొరియాకు చెందిన ఒక అధికారి చైనా వెళ్లి వచ్చాడు.చైనా నుండి వచ్చిన తర్వాత అతడి ఆరోగ్యం క్షీణించింది.
దాంతో అతడికి కరోనా ఉందనే అనుమానంతో కిమ్ అతడిని చంపేయాలంటూ ఆదేశించారట.ఇతర దేశాల్లో ఇలా జరిగింది అంటే అనుమానించొచ్చు.
కాని ఉత్తర కొరియాలో జరిగిందంటే జరిగే ఉంటుందని అనుకోవచ్చు.ఎందుకంటే కిమ్ అస్సలు ఇలాంటి వారికి ఊరుకోడు.