చైనాలో చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ అంతే స్పీడ్గా ప్రపంచ దేశాల్లోకి కూడా పాకుతుంది.ఇప్పటికే జపాన్లో పెద్ద ఎత్తున కరోనా బాధితులు నమోదు అవుతుండగా ఇంకా పదిహేను దేశాల్లో కూడా కరోనా బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు.
ఇండియాలో మొదటి కరోనా కేసు కేరళలో నమోదు అయిన విషయం తెల్సిందే.కేరళలో ఇప్పటికే ఇందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు.
ఈ సమయంలోనే కోల్కత్తాలో కూడా ముగ్గురికి కరోనా ఉన్నట్లుగా పరీక్షల్లో వెళ్లడయ్యింది.
విదేశాల నుండి గత నెలలో వీరు ఇండియాకు వచ్చారు.
ఇటీవల వారు అనారోగ్యం పాలవ్వడంతో వైధ్య పరీక్షలకు వెళ్లగా అనుమానం వచ్చిన డాక్టర్లు కరోనా టెస్టు చేయించగా పాజిటివ్ వచ్చింది.దాంతో ప్రస్తుతం కోల్కత్తాలో వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి చికిత్స అందిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాల వారు ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్లో వైరస్ మరింతగా విస్తరించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.