నిత్యం ఏదో ఒక వివాదంతో స్నేహం చేస్తూ ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేటువంటి టాలీవుడ్ సినీ క్రిటిక్స్ కత్తి మహేష్ గురించి తెలియని వారు ఉండరు.అయితే తాజాగా హిందువులు మరియు హిందువుల దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అతడిపై కొందరు ప్రజాసంఘాల నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే ఇటీవల కాలంలో కత్తి మహేష్ హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి రాముడు పై పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇందులో భాగంగా రాముడి మందిరంలో నిత్యం అతడికి ఇష్టం అయినటువంటి ఉంపుడుగత్తెలు ఉండే వాళ్ళని వారితో సరస సల్లాపాలు సాగిస్తూ ఉండేవాడని కించపరిచే విధంగా మాట్లాడాడు.
దీంతో ఆగ్రహానికి గురైన టువంటి పలు ప్రజా సంఘాల నాయకులు అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.ఈ క్రమంలోప్రముఖ ముఖ అడ్వకేట్ కే కరుణ సాగర్ హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ లో రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ సినీ విమర్శకులు కత్తి మహేష్ పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు నమోదు చేశారు.
దీంతో పోలీసులు కత్తి మహేష్ ను కేసు విచారణ నిమిత్తమై పోలీస్ స్టేషన్ కి హాజరుకావాలని నోటీసులు పంపించారు.ఈ విషయం తెలుసుకున్నటువంటి నెటిజన్లు కత్తి మహేష్ ని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.అంతే గాక ఈసారి జైలు కెళితే ఇంక తిరిగి వచ్చేది లేదంటున్నారు.అంతేగాక గతంలో పవన్ కళ్యాణ్ పై కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి కొంతకాలం పాటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ బహిష్కరణకు గురయ్యాడు.
అయితే అప్పట్లో ఈ వివాదం బాగానే దుమారం రేపినప్పటికీ కొందరు సినీ పెద్దలు చేసుకోవడంతో సర్ధుమణిగింది.
అయితే ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీంతో కత్తి మహేష్ పై ఫిర్యాదు నమోదు చేయడంలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఏమైనా ఉందా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.