నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వి’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో నాని విలన్గా నటిస్తున్నాడనే విషయం తెలిసినప్పటి నుండి ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా సినిమా చూసేందుకు ఆతృతగా ఉన్నారు.
ఇక ఈ సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు కూడా బాగానే పెరిగాయి.
అయితే నానితో పోటీ పడేందుకు ఓ యంగ్ హీరో రెడీ అయ్యాడు.
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం తన ఆశలన్నీ ‘ఒరేయ్ బుజ్జిగా’ అనే సినిమాపై పెట్టుకున్నాడు.రీసెంట్గా ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే బోరింగ్ సినిమాతో ప్రేక్షకులతో జండు బామ్ కొనిచ్చాడు ఈ హీరో.
ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎందుకు ఈ సినిమా చేశాడా అని ప్రశ్నించని వారు లేరు.ఇప్పుడు ఆ ఫ్లాప్ నుండి ఎలాగైనా బయటపడేందుకు రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాతో మనముందుకు వస్తున్నాడు.
అయితే ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని అనుకున్నారు.కానీ కొన్ని కారణాలతో ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ తెలిపింది.దీంతో నాని-సుధీర్ బాబుల మల్టీస్టారర్ మూవీ ‘వి’కి పోటీగా రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా రిలీజ్ కానుంది.మరి ఈ ఉగాదికి ఏ సినిమా సక్సెస్ కొడుతుందో, ఏది బొక్కబోర్లా పడుతుందో తెలియాలంటే మాత్రం మార్చి 25 వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.
.