పవన్ కళ్యాణ్ ముందు రేణు దేశాయ్ కి న్యాయం చెయ్యు.. వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

సుగాలి ప్రీతీని అత్యాచారం చేసి, హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూల్ లో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ సమావేశంలో అధికార వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

 Ysrcp Mla Comments On Pawan Kalyan Kurnool Tour-TeluguStop.com

సుగాలి ప్రీతీ కేసు విచారణని సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఎప్పటిలానే పవన్ కళ్యాణ్ ఏదైనా సభ పెడితే వెంటనే వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి అతనిని తిట్టడం పరిపాటిగా పెట్టుకుంటారు.

అదే దారిలో వైసీపీ కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మీడియా ముందుకి వచ్చి పవన్ కళ్యాణ్ మీద విమర్శల దాడి చేశారు.కర్నూలులో 2017లో బాలికపై జరిగిన హత్యాచారం జరిగితే ఇప్పుడు న్యాయం చేయాలని పవన్‌ అడగడంలో ఉన్న రాజకీయ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనపై న్యాయం చేయాలని పవన్‌ కల్యాణ్‌ కి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ నిలదీశారు.

పవన్‌ వల్ల రేణు దేశాయ్‌ ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసని, ఇప్పుడు అలాంటి వ్యక్తి వచ్చి సుగాలి ప్రీతీని న్యాయం చేయాలని అడుగుతూ ఉంటె హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఆడవాళ్ళపై జరుగుతున్నా అత్యాచారాలని నిరోధించడానికి ముఖ్యమంత్రి జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చి న్యాయం చేస్తున్నారని తెలిపారు.బాధిత బాలిక కుటుంబానికి న్యాయం జరగాలన్న ఉద్దేశ్యంతో డీజీపీని తాము కలిసామని పవన్‌ రోడ్డు మీదకు రాకముందే సీబీఐ విచారణకు పరిశీలించాలని డీజీపీని కోరడం జరిగిందని తెలిపారు.

ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ వచ్చి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.బాలిక పేరు చెప్పకూడదనే కనీసం ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ వ్యవహరించి రాజకీయం చేస్తున్నారని అన్నారు.

రాయలసీమ అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తికి ఇక్కడికి వచ్చే అర్హత లేదని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube