ఆ ఇంట్లో అనుమానాస్పదంగా ఐదు శవాలు... ఏం జరిగిందంటే..?

దేశ రాజధాని ఢిల్లీలోని భ‌జ‌న్‌పురాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు నాలుగైదు రోజుల క్రితం మృతి చెందారు.

 In Delhi 5 Decomposed Bodies In Family-TeluguStop.com

ఆ ఇంటి నుండి దుర్వాసన వస్తూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టారు.ఆ ఇంట్లో దంపతులతో పాటు ముగ్గురు పిల్లల శవాలు కుళ్లిపోయిన స్థితిలో పోలీసులకు కనిపించాయి.

విషాహారం తిని వారు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

నాలుగైదు రోజుల క్రితమే వారు చనిపోయినప్పటికీ లోపల గడియ పెట్టడంతో వారు మృతి చెందిన విషయాన్ని స్థానికులు ఎవరూ గుర్తించలేకపోయారు.

వారు భజన్ పురాకు వచ్చి కేవలం ఆరు నెలలే కావడంతో స్థానికులకు కూడా వీరి కుటుంబంతో పెద్దగా పరిచయాలు లేవు.శంబు అనే వ్యక్తి ఆరు నెలల క్రితం తన భార్య సునీత, ముగ్గురు పిల్లలతో కలిసి భజర్ పూర్ ఏరియాలోని ఒక ఇంట్లో అద్దెకు దిగాడు.

ఈ రిక్షాను నడిపి శంబు జీవనం సాగించేవాడు.ఆర్థికపరమైన సమస్యల కారణంగానే శంబు, అతని కుటుంబం విషాహారం తిని చనిపోయినట్లు తెలుస్తోంది.

మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పోస్టుమార్టం నివేదిక ఇంకా రావాల్సి ఉంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube