సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మహేష్ సరికొత్త రికార్డులకు తెరలేపాడు.
వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమాతో మహేష్ మరో బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు.
కాగా ఈ సినిమా మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్ల షేర్ వసూళ్లకు పరుగులు పెడుతున్న ఈ సినిమా మరో అరుదైన ఫీట్ను అందుకోనుంది.ఇటీవల కాలంలో సినిమాలు నెలరోజులు ఆడటమే లేదు.
అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా ఏకంగా 50 రోజుల వేడుకను జరుపుకునేందుకు రెడీ అవుతోంది.
ఈ చిత్రం ఫిబ్రవరి 29న 50 రోజులు పూర్తి చేసుకోనుంది.
కాగా ఈ వేడుకలను మార్చి 1న కర్నూలులో జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ వేడుకలను అంగరంగ వైభవంగా చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది.
మహేష్ పవర్ప్యాక్ పర్ఫార్మెన్స్కు రష్మిక అందాలు, విజయశాంతి పవర్ఫుల్ రీఎంట్రీ తోడవడంతో సినిమా సూపర్ సక్సె్స్ అయిన విషయం తెలిసిందే.