ప్రస్తుతం ఏపీలో రాజధాని విషయం హాట్ టాపిక్గా ఉంది.తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు అమరావతి ప్రాంత రైతులు ప్రభుత్వంకు వ్యతిరేకంగా అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారు.
అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని, జగన్ నిర్ణయం ఏమాత్రం సరిగా లేదంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు గత రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు.ఇదే సమయంలో అసెంబ్లీలో మూడు రాజధానులకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును కూడా తీసుకు వచ్చారు.
ఆ బిల్లు మండలిలో ఆగినా కూడా మూడు రాజధానుల విషయంను వదిలి పెట్టేది లేదు అంటూ జగన్ చాలా భీష్మించుకు కూర్చున్నాడు.అమరావతి రాజధాని తరలింపు అక్రమం అంటూ ఒక సినిమాను రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ తెలుగు దేశం పార్టీ నాయకురాలు శోభరాణి అన్నారు.దివ్యవాణి మరియు తాను కలిసి ‘అమరావతి నా రాజధాని’ అనే చిత్రాన్ని తీయబోతున్నట్లుగా ప్రకటించింది.
శోభరాణి గతంలో ప్రజారాజ్యంలో కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే.ప్రజారాజ్యం పోవడంతో ఆమె టీడీపీలో జాయిన్ అయ్యారు.ఇక సినీ నటి అయిన దివ్యవాణి ఇటీవలే తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయిన విషయం తెల్సిందే.
వీరిద్దరు కలిసి అమరావతి నా రాజధాని సినిమాను చేయబోతున్నారు.అమరావతిలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రంలో రాజధాని గురించి ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనే విషయాలను సినిమా ద్వారా చూపించబోతున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చారు.
నెల రోజుల్లోనే సినిమాను పూర్తి చేస్తామన్నారు.నిజ సంఘటనలు కూడా ఆ సినిమాలో ఉంటాయని ఆమె పేర్కొన్నారు.మరి ఈ చిత్రం ను ప్రభుత్వం విడుదల కానిస్తుందో లేదో చూడాలి.