నిత్యం తెలుగు సినీ పరిశ్రమలో ఎవరో ఒకరి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నటువంటి శ్రీరెడ్డి గురించి తెలియని వారుండరు.అయితే ఇటీవల కాలంలో శ్రీ రెడ్డి టాలీవుడ్ సినీ పరిశ్రమ బహిష్కరణకు గురై ఈ అమ్మడు మూటాముల్లె సర్దుకుని చెన్నై వెళ్ళిపోయింది.
అయితే ఇదే అదునుగా భావించి చెన్నై నుంచి సోషియల్ మీడియా మాధ్యమమైనటువంటి పేస్ బుక్ ద్వారా టాలీవుడ్ ని టార్గెట్ చేస్తూ రోజు ఏదో ఒక వివాదంలో నిలుస్తోంది.
అయితే తాజాగా ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ అమ్మడు.
గతంలో రాకేష్ మాస్టర్ శ్రీ రెడ్డి గురించి మాట్లాడుతూ శ్రీ రెడ్డి లాంటి అమ్మాయిని నడిరోడ్డుపై జనాలు చెప్పు తీసుకొని కొడతా రని, అసలు ఇలాంటి వాళ్ళకి ఈ సమాజంలో ఎవరు విలువ ఇవ్వరని పలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.దీంతో ఈ విషయంపై శ్రీ రెడ్డి తాజాగా స్పందించారు.
ఇందులో భాగంగా బూతులు మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి.రేయ్ అడవి పంది నిన్ను చూస్తే జాలేస్తుందని, నిన్ను బూతులతో తిట్టడం మొదలు పెడితే మీ తాతలు దిగి వచ్చి నాకు సారీ చెబుతారని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
అంతేగాక ఇంకోసారి తనపై ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చింది.
అయితే ప్రస్తుతం శ్రీ రెడ్డి సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోయినప్పటికీ యూట్యూబ్ లో మాత్రం అదరగొడుతోంది.ఇందులో భాగంగా తన యూట్యూబ్ ఛానల్ లో వంటలకు సంబంధించిన వీడియోలతో ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.