తమిళంలో రెండేళ్ళ క్రితం మాధవన్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిన సినిమా విక్రమ్ వేద.ఈ సినిమా తమిళంలో కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టింది.
దీంతో అప్పట్లో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని నిర్మాత సురేష్ బాబు ప్లాన్ చేశాడు.మళ్ళీ కారణాలు ఏంటి అనేది తెలియదు కాని దానిని పక్కన పెట్టాడు.
అయితే ఊహించని విధంగా ఇప్పుడు మరల ఆ సినిమా తెరపైకి వచ్చింది.దానిని భారీ మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కించాలని సురేష్ బాబు చూస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇందులో మాధవన్ పాత్రలో రామ్ చరణ్, విజయ్ సేతుపతి పాత్ర కోసం రానాని తీసుకోవాలని చూస్తున్నట్లు బోగట్టా.
అన్ని అనుకూలంగా జరిగితే ఈ ఏడాది ఆఖర్లులో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే విక్రమ్ వేదాని సెట్స్ పైకి తీసుకెళ్లదానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమాకి దర్శకుడుగా సురేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
మరి ఇది ఎంత వరకు వాస్తవ రూపం దాల్చుతుంది అనేది తెలియాలంటే అఫీషియల్ లో ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.