ఈ అనంత విశ్వంలో సృష్టి, స్థితి, లయం అనేవి నిత్యం జరిగేవి.అయిన అవి జరిగినట్లు కాని, ఎలా జరుగుతాయి అని కాని నిజంగా బ్రతికున్న ఎవరికి తెలియదు.
ముఖ్యంగా ఈ అనంత విశ్వం లయం అయ్యే యుగాంతం అనేది ఎప్పుడు, ఎలా, ఎ రూపంలో వస్తుందో అనేది చెప్పలేని సమాధానం.ఈ భూమిపై ప్రకృతి విపత్తుల కారణంగా లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోతున్న అది పూర్తిగా జీవ మనుగడని నాశనం చేయడం లేదు.
అయితే భవిష్యత్తుని ముందే ఊహించిన తత్వ వేత్తలు, హేతువాదులు, పురాణ పురుషులు ఈ యుగాంతం గురించి కొన్ని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.వారిలో నోస్ట్రడోమస్, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్వామి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి.
ఆ తరువాత వంగోలియా యోగిని గురించి చెప్పుకోవాలి.
యుగాంతం గురించి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా కథలు వచ్చాయి.2012లో యుగాంతం అయిపోతుందని మయాన్ క్యాలెండర్ చెప్పినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.అది వెళ్ళిపోయింది.
తరువాత ఈ పదేళ్ళలో యుగాంతం గురించి చాలా సార్లు పుకార్లు వినిపించాయి.అయితే వాటిలో ఏ ఒక్కటి వాస్తవం కాలేదు.
అయితే 12 ఏళ్లకే కళ్ళు పోయిన వంగోలియా యోగిని చనిపోయే లోపు భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి ఎన్నో చెప్పింది.వాటిలో చాలా వరకు జరిగాయి.
ఆమె 54 ఏళ్ళ కిందటే 2020లో డిసెంబర్ 10వ తేదీన యుగాంతం వస్తుంది అని చెప్పి మరణించింది.ఆమె చెప్పిన డిసెంబర్ కి ఇంకా పది నెలలు మాత్రమే మిగిలాయి.
ఈ నేపధ్యంలో యుగాంతం నుంచి ఈ సారి ఎవరు తప్పించుకోలేరని అంటున్నారు.చైనాలో ఒక వైరస్ పుట్టి ప్రజలు అధిక సంఖ్యలో మరణిస్తారని ఆమె అప్పట్లో చెప్పినట్లు కూడా చెబుతున్నారు.
మరి ఈ సారి యుగాంతం అనేదానిలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.