సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.ఈ సినిమాతో మహేష్ మరోసారి తన సత్తాను బాక్సాఫీస్కు చూపించాడు.
దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కడంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సె్స్ అయ్యింది.
రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా తన దూకుడును చూపించింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి 31 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.137.55 కోట్ల మేర వసూళ్లు సాధించింది.మహేష్ స్టామినాకు ఏమాత్రం తగ్గకుండా తన సత్తా చాటిన ఈ సినిమా అటు నిర్మాతలతో పాటు చిత్రాన్ని రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభాలను అందించింది.
ఇక ఏరియాల వారీగా ఈ చిత్రం 31 రోజలు ప్రపంచవ్యాప్త కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 39.52 కోట్లు
సీడెడ్ – 15.54 కోట్లు
గుంటూరు – 9.89 కోట్లు
ఉత్తరాంధ్ర – 19.76 కోట్లు
ఈస్ట్ – 11.29 కోట్లు
వెస్ట్ – 7.42 కోట్లు
కృష్ణా – 8.84 కోట్లు
నెల్లూరు – 4.02 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 116.28 కోట్లు
కర్ణాటక – 7.51 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.81 కోట్లు
ఓవర్సీస్ – 11.95 కోట్లు
టోటల్ వరల్డ్వైడ్ – 137.55 కోట్లు
.