స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది.ఈ సినిమాతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన సత్తాను మరోసారి బాక్సాఫీస్కు చూపించాడు.
మ్యూజిక్ ట్రీట్ అందించిన ఈ సినిమా విజువల్ పరంగా కూడా అంతే సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
బన్నీ యాక్టింగ్, త్రివిక్రమ్ టేకింగ్ కలగలిసి ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లాయి.
ఈ సినిమాలోని కథ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సె్స్ కావడం, సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాలు ఈ చిత్రం ముందు నిలబడలేకపోవడంతో అల వైకుంఠపురములో సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 30 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.158.48 కోట్ల మేర వసూళ్లు సాధించింది.
పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా సరికొత్త నాన్-బాహుబలి రికార్డులను క్రియేట్ చేస్తూ మిగతా సినిమాలకు సరికొత్త ఛాలెంజ్ను విసిరింది.ఇక ఈ సినిమా 30 రోజులకు గాను కలెక్ట్ చేసిన కలెక్షన్లు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 44.17 కోట్లు
సీడెడ్ – 18.09 కోట్లు
గుంటూరు – 11.02 కోట్లు
ఉత్తరాంధ్ర – 19.66 కోట్లు
ఈస్ట్ – 11.29 కోట్లు
వెస్ట్ – 8.85 కోట్లు
కృష్ణా – 10.65 కోట్లు
నెల్లూరు – 4.65 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 128.38 కోట్లు
కర్ణాటక – 9.18 కోట్లు
కేరళ – 1.17 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.44 కోట్లు
ఓవర్సీస్ – 18.31 కోట్లు
టోటల్ వరల్డ్వైడ్ – 158.48 కోట్లు
.