అరవింద సమేత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చిన ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్లు మళ్లీ జత కట్టబోతున్నారు.ఇప్పటికే వీరి కాంబో మూవీ అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది.
అతి త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.అల వైకుంఠపురంలో చిత్రం హిట్తో జోరు మీదున్న త్రివిక్రమ్ ఇదే సమయంలో ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్లు వేసవి నుండి షూటింగ్ను మొదలు పెట్టాలని భావిస్తున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.కాని పూజా హెగ్డే లేదా నివేదా పేతురాజ్ల పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి.వీరిద్దరు కూడా త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో నటించిన వారే.అందుకే మళ్లీ వారినే రిపీట్ చేయాలనే అభిప్రాయంలో త్రివిక్రమ్ ఉన్నాడు.ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే రాజకీయ నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు.రాజకీయ వారసుడిగా ఎన్టీఆర్ కనిపిస్తాడని అంటున్నారు.
రాజకీయ హత్యలో చనిపోయిన తండ్రి మరణంకు ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడని సమాచారం అందుతోంది.అతి త్వరలోనే ఈ సినిమాకు టైటిల్ను కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.త్రివిక్రమ్ గత చిత్రాల మాదిరిగానే ఎన్టీఆర్ చిత్రానికి కూడా ‘అ’ అక్షరంతోనే మొదలు అయ్యే టైటిల్ను పెట్టే అవకాశం ఉంది.ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ ఉంది కనుక సమ్మర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.