ప్రస్తుతం టాలీవుడ్లో ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పూజా హెగ్డే వరుసబెట్టి సినిమాలు చేస్తోంది.స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ, యంగ్ హీరోలతోనూ ఆడిపాడుతోంది.
కెరీర్ మొదట్లో వరుసగా ఫెయిల్యూర్లు అందుకున్న ఈ బ్యూటీ డీజే సినిమాతో హిట్ బాట పట్టింది.ఆ తరువాత వరుసగా హిట్ చిత్రాలు చేస్తూ టాలీవుడ్లో దూసుకుపోతుంది.
కాగా టాలీవుడ్లోనే కాకుండా అమ్మడు బాలీవుడ్లోనూ తన జోరును కొనసాగిస్తోంది.గతేడాది రిలీజ్ అయిన ‘హౌజ్ఫుల్ 4’ చిత్రంలో నటించి అదిరిపోయే సక్సెస్ను అందుకున్న పూజా హెగ్డే, తాజాగా మరో బంపర్ ఆఫర్ను దక్కించుకుంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ను దక్కించుకుంది పూజా.ఫర్హద్ సామ్జీ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్గా పూజాకు అవకాశం వచ్చిందట.
సాజిద్ నడియడ్వాలా ప్రొడ్యూస్ చేస్తు్న్న ఈ సినిమాకు ‘కభీ ఈద్ కభీ దివాలీ’ అనే టైటిల్ను పెట్టినట్లు తెలుస్తోంది.
రీసెంట్గా అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరో మేజర్ ప్రాజెక్టును బాలీవుడ్లో అందుకోవడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.ఏదేమైనా పూజా హెగ్డేకు పట్టిన అదృష్టాన్ని చూసి మిగతా హీరోయిన్లు కుళ్లుకుంటున్నారు.