ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఈనెల 12 మరియు 13వ తేదీల్లో కర్నూలులో పర్యటించనున్నాడు.రెండు రోజుల పాటు కర్నూు జిల్లాలో ఉన్న పలు సమస్యలపై ఆందోళనలు మరియు రాస్తారోకోల్లో పాల్గొనబోతున్నాడు.
పవన్ కళ్యాణ్ను ఇటీవల కలిసిన కర్నూలు జిల్లా కార్యకర్తలు అక్కడ నిర్వహించాల్సిన ఆందోళనలు మరియు రాస్తారోకోలపై చర్చించినట్లుగా సమాచారం అందుతోంది.
ఈనెల 12వ తారీకున కర్నూలులో పవన్ పర్యటన మొదలు అవుతుంది.
సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనకు బాధ్యులు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ర్యాలీ నిర్వహించనున్నారు.మద్యాహ్నం సమయంలో ఈ ర్యాలీని నిర్వహించబోతున్నారు.పెద్ద ఎత్తున విద్యార్థులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొనబోతున్నారు.ఇక 13వ తారీకున కర్నూలు జిల్లా ఎమిగనూరులో ప్రజలతో మమేకం అయ్యి ప్రజా సమస్యలను తెలుసుకోబోతున్నాడు.
మొత్తానికి ఆ రెండు రోజులు పవన్ బిజీ బిజీగా ఉండబోతున్నారు.