మరో నాలుగు రోజుల్లో ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేమికుల రోజు రాబోతుంది.అయితే గతంలో మాదిరిగా రోడ్లపై పార్క్ల్లో ప్రేమికుల రోజులను సెలబ్రేట్ చేసుకునే పరిస్థితులు లేవు.
ఎక్కడ సీసీ కెమెరాల్లో పడతామో, ఎక్కడ మొబైల్ కెమెరాలతో చిత్రీకరించి బయట పెడతారో, ఎక్కడ భజరంగ్ దళ్ వారు, విశ్వహిందూ పరిశత్ వారు వచ్చి పెళ్లి చేస్తారో అనే భయం ప్రేమికుల్లో వ్యక్తం అవుతుంది.దాంతో ఈమద్య కాలంలో ప్రేమికుల రోజున బయట తిరిగేందుకు భయపడుతున్నారు.
ప్రేమికుల రోజును మరేదైనా రోజున సెలబ్రేట్ చేసుకోవచ్చు అనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు.
ఇలాంటి నేపథ్యంలో ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు కొందరు కొత్త పద్దతిని అనుసరిస్తున్నారు.ఆన్లైన్లో హోటల్ రూమ్స్ను బుక్ చేసుకునే ఓయో యాప్ ద్వారా ఫిబ్రవరి 14వ తారీకున పెద్ద ఎత్తున రూమ్స్ బుక్ అవుతున్నాయట.రూంలను ఎక్కువగా పాతిక నుండి 30 ఏళ్ల లోపు వారు చేస్తున్న కారణంగా వీరంతా కూడా తమ ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు ఆ రోజు హోటల్ రూమ్స్ను బుక్ చేస్తున్నారేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రోడ్డు మీద కలుసుకుంటే ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది.అదే ఇలా రూంలో గుట్టు చప్పుడు కాకుండా ప్రేమికుల రోజున కలవడంతో పాటు అన్ని కూడా అనుభవించవచ్చు అనేది చాలా మంది ప్లాన్గా తెలుస్తోంది.
అయితే ఓయోలో పెద్ద ఎత్తున రూమ్స్ బుక్ అవ్వడంతో పోలీసులు దృష్టి పెట్టే అవకాశం కూడా ఉంది అంటున్నారు.కాస్త జాగ్రత్తగా లేకుంటే మాత్రం మరింత పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
చిన్న పాటి కక్కుర్తి కోసం ఇలాంటి పనులు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.