దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.నేడు పోలింగ్కు జనాలు భారీ ఎత్తున హాజరు అవుతున్నారు.
హస్తినలో ఎప్పుడు కూడా భారీ పోలింగ్ నమోదు అవుతూ ఉంటుంది.ఈసారి అంతకు మించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పోలింగ్ శాతం పెరగడంపై పార్టీల్లో కాస్త కలవరం మొదలైంది.అధికార పార్టీ ఆప్ ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉండగా బీజేపీ కూడా మోడీ ప్రభజనంతో రాజధానిలో కూడా పాగా వేస్తామనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం ప్రారంభం అయిన పోలింగ్ అన్ని చోట్ల కూడా సాఫీగా సాగుతుంది.సమస్యాత్మక ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.పౌరసత్వ బిల్లుకు సంబంధించిన అల్లర్లు ఎన్నికలపై ప్రభావం చూపకుండా ఎన్నికల కమీషన్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రప్రభుత్వాలకు చెందిన భద్రత అధికారులు ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు.
పెద్ద ఎత్తున అధికారులు ఎన్నికల శైలిని పర్యవేక్షిస్తు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు.