ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ మరియు బీజేపీలు హోరా హోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.నేటితో ప్రచారం ముగియబోతున్న నేపథ్యంలో రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారంకు సిద్దం అయ్యాయి.
ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు.ఇప్పటికే బీజేపీ నాయకులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఉగ్రవాది అంటూ పదే పదే విమర్శలు చేయడం జరిగింది.
ఎన్నికల కమీషన్ ఆ విమర్శలపై సీరియస్ అయినా కూడా బీజేపీ నాయకులు కొందరు కేజ్రీవాల్ను ఉగ్రవాదిగానే అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేశారు.
తన తండ్రి కేజ్రీవాల్ను బీజేపీ నాయకులు ఉగ్రవాది అంటూ ముద్ర వేయడంపై ఆయన కుమార్తె స్పందించారు.
ప్రతి రోజు ఉదయం నిద్ర లేపి తమకు భగవద్గీతను భోదించే మా నాన్న గారు ఎలా ఉగ్రవాది అవుతారంటూ ఆమె ప్రశ్నించారు.పేదలకు ఉచిత విద్య అందిస్తూ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి అనుకునే మా నాన్న ఎలా ఉగ్రవాది అవుతారో వారే చెప్పాలంటూ ఆమె ప్రశ్నించారు.
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకులు కేజ్రీవాల్ను ఎదుర్కోలేక ఇలాంటి కుయుక్తలు పన్నుతున్నట్లుగా ఆప్ పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.