అయ్యర్‌ సెంచరీ.. భారత్‌ భారీ స్కోర్‌

న్యూజిలాండ్‌ను వారి సొంత గడ్డపై ముప్పు తిప్పలు పెడుతున్న టీం ఇండియా వన్డేల్లో కూడా అదే జోరును కొనసాగిస్తుంది.టీ20 సిరీస్‌లో క్లీన్‌ స్వీప్‌ చేసిన టీం ఇండియా వన్డేల్లో కూడా అదే జోరును కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా కనిపిస్తుంది.నేడు ఇండియా న్యూజిలాండ్‌ల మద్య మొదటి వన్డే మ్యాచ్‌ జరుగుతుంది.మొదట బ్యాటింగ్‌ చేసిన టీం ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా 347 పరుగులు చేయడం జరిగింది.

 Shreyas Iyar Centuray In India Vs New Zeland Match-TeluguStop.com

చివరి రెండు ఓవర్స్‌లో న్యూజిలాండ్‌ బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 370 అనుకున్నది కాస్త తక్కువ అయ్యింది.

మొదటి రెండు వికెట్లు స్వల్ప స్కోర్‌కే పోయినా కూడా తర్వాత వచ్చిన కోహ్లీ, అయ్య, కేఎల్‌ రాహల్‌లు అద్బుతమైన ఆటతో స్కోర్‌ బోర్డును పరిగెత్తించి న్యూజిలాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు.

శ్రేయాస్‌ అయ్యర్‌ 107 బాల్స్‌లో 103 పరుగులు కొట్టాడు.కోహ్లీ 63 బాల్స్‌లో హాప్‌ సెంచరీ పూర్తి చేసి ఔట్‌ అయ్యాడు.

ఇక చివరగా కేఎల్‌ రాహుల్‌ 64 బాల్స్‌ ఆడి 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.మరో ఎండ్‌ లో కేదార్‌ జాదవ్‌ 15 బాల్స్‌ ఆడి 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఈ భారీ స్కోర్‌ను చేజ్‌ చేయడం న్యూజిలాండ్‌కు కష్టమే అంటున్నారు.టీం ఇండియా బౌలర్లు ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్నారు కనుక ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube