అమెరికా వెళ్లి సెటిల్ అయిన ఎంతో మంది భారతీయులు అక్కడ రాజకీయాలలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.కొంత మంది రాజకీయ నాయకులు అయితే అధ్యక్ష బరిలో పోటీ పడేంత వరకు కూడా వస్తున్నారు.
అయితే ఏవో కారణాల వలన మరల ఈ పోటీల నుంచి తప్పుకుంటున్న అక్కడి రాజకీయాలలో మాత్రం మనవాళ్ళు చక్రం తిప్పుతున్నారని చెప్పాలి.ఇంకా అక్కడి తెలుగు వాళ్ళు కూడా రాజకీయాలలో సత్తా చూపిస్తూ తన ప్రస్తానం సాగిస్తున్నారు.
ఇప్పుడు అదే దారిలో తెలంగాణా వ్యక్తి అమెరికాలో పార్లమెంటేరియన్ గా పోటీ చేస్తున్నారు.
సామాజిక సేవలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణా వ్యక్తి ఆలూరి బంగారు రెడ్డి టెక్సాస్ జిల్లా నుంచి పార్లమెంటేరియన్స్ గా పోటీ చేస్తున్న 22 మందిలో తాను కూడా ఒకరు అతను అమెరికా రాజకీయాలని శాసిస్తున్న రిపబ్లికన్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు.
ఇక ఈ ఎన్నికల కోసం ఆయన విరాళాల సేకరణ చేపట్టారు.ఈ ఎన్నికల్లో తాను కచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.ఎన్నారైలలో తెలుగువాళ్ళతో పాటు భారతీయ అమెరికన్ ల నుంచి అతనికి మద్దతు ఉండటంతో విజయంపై నమ్మకంతో ఉన్నారు.