అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన నాల్గవ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తు్ండటంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు అక్కినేని బుల్లోడు.
కాగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.అఖిల్ కొంత గ్యాప్ తరువాత ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమా టైటిల్ను చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం రివీల్ చేశారు.ఈ సినిమాకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.
ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుని నిలదొక్కుకోవాలని అఖిల్ ఆశిస్తున్నాడు.అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.
ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.
ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
కాగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.మరి బొమ్మరిల్లు డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.