యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం జాను రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాను ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
కాగా ఈ సినిమా ప్రమోషన్స్ను చిత్ర యూనిట్ జోరుగా చేస్తున్నాయి.
ఇందులో భాగంగా శర్వానంద్ తన వివాహం గురించి ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో శర్వానంద్కు కాబోయే భార్య ఎలా ఉండాలి అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు మజిలీ సినిమాలో సమంత లాంటి భార్య కావాలని తెలిపాడు.
ఆ సినిమాలో తన భర్త కోసం ఏదైనా చేసే శ్రావణి లాంటి అమ్మాయి అయితే తాను వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ బదులిచ్చాడు.
ఇక జాను సినిమాలో సమంతతో నటించడం నిజంగా సంతోషంగా ఉందని శర్వా చెప్పుకొచ్చాడు.
సమంత, శర్వాల మధ్య వచ్చే రొమాంటిక సీన్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.తమిళంలో సూపర్ సక్సె్స్ అయిన 96 చిత్రానికి రీమేక్గా ఈ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.
మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటందో చూడాలి.