పలు భాషల్లో ప్రసారమయ్యేటువంటి బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పనవసరం లేదు.అయితే ఈ షో ద్వారా పలువురు నటీనటులు వెలుగులోకి వచ్చి అవకాశాలను కూడా దక్కించుకుంటున్నారు.
అయితే ఎక్కువగా హిందీలో బిగ్ బాస్ షో విజయవంతంగా దూసుకుపోతోంది.ఇప్పటికే దాదాపుగా 12 సీజన్లో పూర్తిచేసుకొని 13వ సీజన్ కూడా విజయవంతంగా దూసుకుపోతోంది.
అయితే తాజాగా ఈ బిగ్ బాస్ షోపై నటి పాయల్ రోహత్గీ ఈ వ్యాఖ్యలు చేసింది.ఇందులో భాగంగా సినీ పరిశ్రమలో పనుల్లేక ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ షోలో పాల్గొంటారని, అంతేగాక బిగ్ బాస్ షో లో పాల్గొంటే అవకాశాలు వస్తాయని అనుకోవడం వారి బ్రమ అని అన్నారు.
తాను కూడా బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్నానని కాకపోతే ఆ సమయంలో తనకు ఎలాంటి అవకాశాలు రాలేదని, కాబట్టి బిగ్ బాస్ షోలో పాల్గొంటే అవకాశాలు వస్తాయి అనడం కేవలం ఒక అపోహ మాత్రమేనని దాంట్లో ఎటువంటి నిజం లేదని అన్నారు.
అయితే ప్రస్తుతం బిగ్ బాస్ షోలో పాల్గొన్న టువంటి అమీషా పటేల్, రష్మీ దేశాయి, సిద్ధార్థ శుక్లా, కోయినా మిత్ర, వంటి వాళ్లకి ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవని అందువల్లనే వాళ్లు బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారని అన్నారు.ఏదేమైనప్పటికీ పాయల్ రోహత్గి మరోసారి బిగ్బాస్ షో పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 13కి సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాడు.