ధనుష్ హీరోగా నటించి సక్సెస్ అయిన అసురన్ చిత్రాన్ని తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.
ఒరిజినల్ వర్షన్ నిర్మాత కళై పులి థానుతో కలిసి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను వేసవి చివర్లోనే విడుదల చేసేలా శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు.
మొన్నటి వరకు అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతుంది.అసురన్ చిత్రంలో మంజు వారియర్ హీరోయిన్గా నటించింది.ఆ సినిమాకు ఆమె హైలైట్ అయ్యింది.
అలా హైలైట్ అయ్యేలా హీరోయిన్ను ఎంపిక చేసేందుకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కిందా మీదా పడుతున్నాడు.పలువురు హీరోయిన్స్ను సంప్రదించి చివరకు అమలాపాల్ను అనుకున్నారు.
కాని ఆమె షూటింగ్ సమయానికి ఏదో కారణంతో తప్పుకుందో లేదంటే తపిపంచారో తెలియదు కాని ఆమె ప్రస్తుతం లేదు.
అమలాపాల్ స్థానంలో ప్రముఖ తమిళ హీరోయిన్ రెబ్బ మోనిక నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈమె బిగిల్ చిత్రంలో యాసిడ్ బాధితురాలి పాత్రలో కనిపించింది.ఆ చిత్రంలో నటిగా మంచి గుర్తింపును దక్కించుకుంది.
అందుకే ఈమెను నారప్పకు జోడీగా తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.అయితే ఇప్పటి వరకు మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు.
శ్రీకాంత్ అడ్డాల లేదంటే యూనిట్ సభ్యులు ఎవరో ఒకరు హీరోయిన్ విషయమై నోరు విప్పే వరకు అసలు విషయం ఏంటో తెలియదు.