టాలీవుడ్లో నేచురల్ స్టార్ నానితో కలిసి మజ్ను సినిమాతో తెరంగేట్రం చేసిన మలయాళ బ్యూటీ అను ఇమ్మాన్యుయెల్ ఆ తరువాత వరుస బెట్టి సినిమాలు చేసింది.కానీ అమ్మడికి సరైన గుర్తింపు మాత్రం రాలేదు.
దీంతో ఆమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంతో ఆమె అదిరిపోయే హిట్ కొడుతుందని అందరూ అనుకున్నారు.కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
దీంతో అను ఇమ్మాన్యుయెల్కు సినిమా ఛాన్సులు తగ్గాయి.కాగా గతకొంత కాలంగా ఈ బ్యూటీ తెలుగు సినిమాలకు దూరంగా ఉంది.తమిళంలో మాత్రం అడపాదడప సినిమాలు చేస్తూ ఉంది.ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగులో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అను హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది.
ఈ సినిమాతో తెలుగులో మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది ఈ బ్యూటీ.
కాగా ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్ పోరి నభా నటేష్ కూడా ఓ హీరోయిన్గా నటిస్తోంది.మరి ఈ సినిమాతోనైనా అనుకు తగిన గుర్తింపు లభిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.