ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ రీమేక్ ప్రాజెక్టుల్లో ‘జాను’ చిత్రం కూడా ఒకటి.తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 చిత్రం సెన్సేషన్ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను యంగ్ హీరో శర్వానంద్, స్టార్ బ్యూటీ సమంత జంటగా ‘జాను’ అనే టైటిల్తో తెరకెక్కిస్తున్నాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
కాగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ప్రైమ్ మీడియా మంచి డీల్కు కుదుర్చుకుంది.జాను ఓవర్సీస్ రైట్స్ను రూ.2 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది.ఈ డీల్ చాలా మంచిదని చిత్ర యూనిట్ తెలిపింది.
ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ను ఆకట్టుకోవడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.
తమిళంలో 96 చిత్రాన్ని తెరకెక్కించిన సి.ప్రేమ్ కుమార్ తెలుగులో జాను సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.గోవింద్ వసంత ఈ సినిమాకు అందిస్తున్న మ్యూజిక్ చిత్రానికే హైలైట్ కానుందని, సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమాను ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.