యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఎంచుకునే సినిమా కథలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే.ఆయన ఎంచుకునే సినిమా కథలు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తుంటాయి.
ఇటీవల అర్జున్ సురవరం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సక్సెస్ కూడా కొట్టిన ఈ హీరో, తనకు బ్లాక్బస్టర్ను అందించిన ‘కార్తికేయ’ సినిమా సీక్వెల్ను త్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.
కార్తికేయ సినిమాను తెరకెక్కించిన చందూ ముండేటి ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
కార్తికేయ సినిమాలాగే ఈ సినిమా కథ కూడా ఆలయాల చుట్టూ తిరుగుతుందని, ద్వారకా నుండి మొదలయ్యే ఈ చిత్ర కథ, స్వయంభూ ఆలయాల చరిత్ర చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.మరోసారి ఆలయానికి సంబంధించిన కథతో కార్తికేయ రానుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక కార్తికేయ సినిమాలో బబ్లీ బ్యూటీ స్వాతి రెడ్డి నటించి మెప్పించగా, కార్తికేయ 2లో ఎవరు నటిస్తారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.కాగా ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్, నభా నటేష్లలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయనున్నారు చిత్ర యూనిట్.