సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో సైనికుడుగా నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో సైనికులకి అంకితం ఇస్తూ ఒక దేశభక్తి గీతాన్ని కూడా పెట్టారు.
ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకలని సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి, విజయశాంతి సైనికుల మధ్య జరుపుకున్నారు.
హైదరాబాద్ లో ఉన్న భద్రతా బలగాలని కలుసుకొని వారికి సర్ప్రైజ్ ఇచ్చారు.
ఇక ఈ వేడుకలలో సైనికులతో తన సంతోషాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు పంచుకోవడంతో పాటు వారితో సెల్ఫీలు కూడా దిగారు.
సైనికులు కూడా సూపర్ స్టార్ తో ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు.ఈ నేపధ్యంలో మహేష్ బాబు సైనికులతో గణతంత్ర వేడుకలని జరుపుకున్న సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని వెల్లడించారు.మనల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న భారత హీరోలకు సెల్యూట్ చేస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా ట్విట్టర్ లో పేర్కొన్నారు.