టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని శర్వానంద్ సొంతం చేసుకున్నారు.హీరో ఫ్రెండ్ పాత్రలతో కెరియర్ స్టార్ట్ చేసి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన నటుడు.
ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో తనకంటూ డిఫరెంట్ మార్కెట్ ని ఏర్పరుచుకొని రెగ్యులర్ జోనర్ లో కాకుండా ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.శర్వానంద్ హీరోగా చివరిగా పడిపడి లేచే మనసు సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.
ప్రస్తుతం 96 రీమేక్ గా తెరకెక్కుతున్న జాను అనే సినిమాలో నటిస్తున్నాడు.ఫీల్ గుడ్ లవ్ స్టొరీతో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా శర్వానంద్ 29 సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.
శ్రీకారం టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.దీనికి సంబందించిన టైటిల్ లుక్ ని రివీల్ చేయడంతో పాటు రేపు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.14 రీల్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తూ ఉండగా ఈ సినిమాతో కిషోర్ రెడ్డి అనే యువ దర్శకుడు పరిచయం పరిచయం అవుతున్నాడు.ఇక దీనికి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తూ ఉండటం విశేషం.ఇదిలా ఉంటే దర్శకుడు కిషోర్ రెడ్డి శ్రీకారం టైటిల్ తో ఓ నాలుగేళ్ల క్రితం షార్ట్ ఫిలిం తీశాడు.
వ్యవసాయం నేపధ్యంలో ఈ షార్ట్ ఫిలిం తీయగా అప్పట్లో అది కాస్తా వైరల్ గా మారింది.చాలా మందిని ఆకట్టుకుంది.ఇప్పుడు అదే షార్ట్ ఫిలిం కథని రెండు గంటల సినిమాగా సిద్ధం చేసి అదే టైటిల్ తో శర్వానంద్ హీరోగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.మిక్కీ జే మియర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తూ ఉన్నాడు.
మరి రైతుల సమస్యలు, వ్యవసాయం నేపధ్యంగా రాబోయే ఈ సినిమాలో శర్వా ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిందే.