తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.అతి కొద్ది స్థానాల్లో మాత్రమే ఓటమి పాలయ్యింది.
అయితే ఎక్కడైతే టీఆర్ఎస్ ఓడిపోయిందో అక్కడ కారు గుర్తుతో పాటు ట్రక్ గుర్తు కూడా ఉందని, ఎక్కువ శాతం ట్రక్ గుర్తు కారణంగానే టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయినట్లుగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.చాలా వరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ట్రక్ గుర్తు ఇవ్వొదంటూ ఎన్నికల కమీషన్కు విజ్ఞప్తి చేయడం జరిగింది.
అభ్యర్థులు ఎక్కువగా ఉన్న చోట కొందరికి ట్రక్ గుర్తు ఇచ్చారని, ఎక్కడైతే ట్రక్ గుర్తుపై ఇండిపెండెంట్స్ పోటీ చేశారో వారు చాలా ఓట్లను దండుకున్నారని, అవి అన్ని కూడా కారుకు రావాల్సిన ఓట్లు అంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ వద్దకు తీసుకు వెళ్లే విషయమై ఆ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు.
మరోసారి ఇలాంటి పరిణామం ఎదురు కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరనున్నారు.ఆమద్య స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.