బ్లాక్‌ మెయిల్‌ చేసి గెలిచారన్న రేవంత్‌ రెడ్డి

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ బ్లాక్‌ మెయిల్‌ చేసి గెలిచింది అంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నాడు.ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్‌తో పాటు పలువురు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు గెలిస్తే జరిగే అభివృద్ది ఆగిపోతుందని అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలంటూ బెదిరించారు.

 Revanth Reddy Comments On Trs Party Minister-TeluguStop.com

అభివృద్దిని ఎక్కడ అడ్డుకుంటారో అనే భయంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటర్లు ఓట్లు వేశారంటూ రేవంత్‌ రెడ్డి అన్నాడు.

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు మంత్రులు ప్రచారం సమయంలో నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించారు.

వారిపై ఎందుకు ఎన్నికల కమీషన్‌ చర్యలు తీసుకోవడం లేదు అంటూ ప్రశ్నించాడు.బ్లాక్‌ మెయిల్‌ చేసిన మంత్రులను.తన ఓటును బాహాటంగా చూపించిన గంగుల కమలాకర్‌ను ఎందుకు ఎన్నికల కమీషన్‌ ప్రశ్నించలేదు అంటూ రేవంత్‌ రెడ్డి ప్రశ్నించాడు.టీఆర్‌ఎస్‌ మొత్తం కూడా అధికార దుర్వినియోగం చేసి ప్రజలను బ్లాక్‌మెయిల్‌ చేసి ఓట్లు దండుకుందని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ప్రజలే గట్టి గుణపాఠం చెప్తారంటూ ఈ సందర్బంగా రేవంత్‌ రెడ్డి అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube