తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తున్నాయి.టీఆర్ఎస్ ఆధిపత్యంతో ఈ ఫలితాలు వస్తుండగా కాంగ్రెస్ మరియు బీజేపీ మేము ఉన్నాం అనిపించుకుంటూ స్థానాలు గెలుచుకుంటున్నారు.
కాని తెలుగు దేశం పార్టీ మాత్రం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయింది.రాష్ట్రంలోని దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో కూడా పోటీ చేస్తామంటూ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ప్రకటించాడు.
అన్నట్లుగానే చాలా మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.కాని ఏ ఒక్కరు కూడా గెలిచిన దాఖలాలు కనిపించడం లేదు.
చివరి ఫలితం వెలువడే వరకు ఏమైనా ఫలితాలు మారి రెండు మూడు స్థానల్లో టీడీపీ గెలిచినట్లుగా వార్తలు ఏమైనా వస్తాయా అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇలాంటి ఫలితాలు ఊహించినవే అని, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగా డబ్బు పంపిణీ చేసి గెలిచింది అంటూ కొందరు నాయకులు విమర్శలు చేస్తున్నారు.
ఓడిపోయిన వారు ఎన్నైనా చెప్తారు.గెలిచిన టీఆర్ఎస్ నాయకులు మాత్రం సంబరాల్లో మునిగి పోయారు.