ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ మరియు హీరో సునీల్ బిజీ షెడ్యూల్ తో గడుపుతున్నాడు.అంతేగాక తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన టువంటి అల వైకుంఠ పురములో చిత్రంలో మంచి ప్రాధాన్యత ఉన్నటివంటి పాత్రలో నటించాడు.
అంతేగాక మెగాస్టార్ చిరంజీవి 152 చిత్రంలో కూడా స్టార్ కమెడియన్ గా నటిస్తున్నాడు.
అయితే తాజాగా సునీల్ కొంతమేర అస్వస్థతకు గురైన కారణంగా హైదరాబాదు నగరంలోని మాదాపూర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
దీంతో సునీల్ ఆరోగ్యంపై పలు వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై సునీల్ తాజాగా స్పందిస్తూ తాను చిన్న ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యుల్ని సంప్రదించడానికి వచ్చానని అంతేగాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తన అభిమానులకు సూచించాడు.
అంతేగాక కొన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరారని తప్ప తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అన్నారు.అయితే సునీల్ గత కొద్దికాలంగా హీరోగా నటించిన చిత్రాలు దారుణంగా డిజాస్టర్ అవుతుండటంతో మళ్ళీ కామెడీ నీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.