రామ్ గోపాల్ వర్మ ఏం అనుకుంటే అదే అనేస్తాడు లేదంటే ట్వీట్ వేస్తాడు.తాజాగా వర్మ చేసిన ట్వీట్ మరోసారి చర్చనీయాంశం అవుతుంది.
నిన్న మండలి సమావేశాలను చూసేందుకు ఎమ్మెల్యేలు చాలా మంది గ్యాలరీకి వెళ్లి కూర్చున్నారు.ఆ సమయంలో బాలయ్య పక్కన కూర్చున్న ఎమ్మెల్యే రోజా ఆయనతో సెల్ఫీ దిగాలని ఆశపడింది.
ఎమ్మెల్యే రోజా స్వయంగా సెల్ఫీ తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.తెలుగు దేశం ఎమ్మెల్యే బాలకృష్ణ.
వైకాపా ఎమ్మెల్యే రోజా అంటూ సోషల్ మీడియాలో ఈ ఫొటో బాగా వైరల్ అయ్యింది.
ఈ ఫొటోపై వర్మ కూడా స్పందించాడు.ఈ ఫొటోలో రోజా చాలా అందంగా ఉన్నారు.కాని ఆమె అందంను పక్కన ఉన్న ఒక దిష్టిబొమ్మ చెడగొడుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
అలాంటి దిష్టి బొమ్మ పక్కన ఎందుకు రోజా గారు ఫొటో దిగారు అంటూ వర్మ పోస్ట్కు నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.బాలకృష్ణపై వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి.
వర్మ నీకు దమ్ముంటే ఆయన ముందు నిలబడి ఆ మాటలు అను అంటూ వర్మకు నందమూరి ఫ్యాన్స్ సవాల్ విసిరారు.
వర్మ పదే పదే బాలకృష్ణను ఈమద్య టార్గెట్ చేయడంతో నందమూరి ఫ్యాన్స్కు పిచెక్కి పోతుంది.త్వరలోనే ఆయన్ను టార్గెట్ చేసినా ఆశ్చర్యం లేదు అంటూ సోషల్ మీడియా టాక్.బాలయ్యను నందమూరి అభిమానులు ఏ స్థాయిలో అభిమానిస్తారో తెలిసిందే.
అలాంటి బాలయ్యను ఇంతగా అవమానిస్తే ఎవరు మాత్రం ఊరుకోరు.ఖచ్చితంగా త్వరలోనే వర్మపై ప్రతీకారం తీర్చుకుంటారు అంటూ బాలయ్య ఫ్యాన్స్ వర్మను హెచ్చరిస్తున్నారు.