అజ్ఞాతవాసి చిత్రం తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తన 26వ చిత్రంను ప్రారంభించాడు.బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ చేస్తున్నారు.
ఆ రీమేక్లో పవన్ నటిస్తున్నాడు.ఈ రీమేక్ కోసం పవన్ కేవలం 40 రోజులు మాత్రమే డేట్లు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
అతి త్వరలోనే ఈ చిత్రంను పూర్తి చేయాలని దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇక ఈ చిత్రాన్ని దిల్రాజు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
ప్రస్తుతం రాజకీయాలతో చాలా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలకు టైం కేటాయించలేక పోతున్నాడు.అయినా కూడా పింక్ కోసం రాత్రి రాత్రి షూటింగ్లో పాల్గొంటాను అంటూ హామీ ఇచ్చాడు.
ఉదయం నుండి సాయంత్రం వరకు అమరావతిలో రాజకీయాలు చేస్తున్న పవన్ రాత్రి 9 అయ్యే టైంకు హైదరాబాద్ వెళ్లి షూటింగ్లో పాల్గొంటున్నాడు.మూడు రోజులు వరుసగా ఇలాగే జరిగింది.
ఈ మూడు రోజులు కూడా ప్రత్యేక విమానంలో పవన్ విజయవాడ నుండి హైదరాబాద్కు ప్రయాణించారు.
మూడు రోజులు ప్రత్యేక విమానం కోసం దిల్రాజు భారీ మొత్తంలో వ్యచ్చించినట్లుగా సమాచారం అందుతోంది.ముందు ముందు కూడా ఇలాగే ఉంటే విమాన ఖర్చులు తడిసి మోపుడు అయ్యేట్లు ఉన్నాయంటూ దిల్రాజు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.చిత్ర యూనిట్ సభ్యులందరిని కూడా విజయవాడ తీసుకు వెళ్లలేని పరిస్థితి, పవన్ను హైదరాబాద్కు తీసుకు రావాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు.
ఈ సమస్య నుండి దిల్రాజు ఎలా బయట పడతాడో.సినిమాను ఎలా పూర్తి చేయిస్తాడో చూడాలి.ప్రస్తుతం పవన్ ఢిల్లీ టూర్లో ఉన్నాడు.వచ్చిన తర్వాత మళ్లీ పింక్ రీమేక్ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు.