తమిళ హీరో ధనుష్ నటించిన అసురన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో ధనుష్ క్రిటిక్స్ ప్రశంసలు కూడా పొందాడు.
ఈ సినిమాలో ధనుష్ యాక్టింగ్కు జనాలు ఫిదా అయ్యారు.కాగా ఈ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే.
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నారు.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు సినిమా టైటిల్ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
నారప్ప అనే టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు అంటున్నారు.కాగా ఈ పోస్టర్స్ రిలీజ్ అయిన దగ్గర్నుండీ సోషల్ మీడియాలో ధనుష్ ఫ్యాన్స్ వెంకటేష్ను తెగ ట్రోల్ చేస్తున్నారు.
ధనుష్ మేకోవర్ ముందు వెంకటేష్ కొత్తదనమేమీ కనిపించలేదంటూ వారు కామెంట్ చేస్తున్నారు.#UnrivalledTamilActors VS #TeluguRealHeroes అనే హ్యాష్ట్యాగ్స్తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
ఈ ట్రోలింగ్ గురించి మరో హీరో సిద్ధార్థ తనదైన శైలిలో కామెంట్ చేశాడు.సౌత్ ఇండియా అభిమానుల్లో పైత్యం పెరిగిపోయిందంటూ కామెంట్ చేయడంతో, మనోడిని లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుంటున్నారు ఇద్దరు హీరోల ఫ్యాన్స్.
మధ్యలో నువ్వెందుకు తలదూర్చావు సామీ అంటూ ఆయన్ను ప్రశ్నిస్తున్నారు సినీ జనం.
ఏదేమైనా ప్రస్తుతం నారప్ప సినిమా పోస్టర్ కంటే కూడా తమిళ, తెలుగు ప్రేక్షకుల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ట్రెండింగ్ కావడంతో సినీ ఇండస్ట్రీలో వేడి వాతావరణం ఏర్పడింది.