యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహో తరువాత నటిస్తున్న తాజా చిత్రం ‘జాన్’ షూటింగ్ను తాజాగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను అనౌన్స్ చేసిన తరువాత షూటింగ్ను మొదలుపెట్టకపోవడంతో ఈ సినిమా ఉంటుందా లేదా అనే డౌట్ అందరిలో మొదలైంది.
కానీ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించారు.
ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా బాలీవుడ్లో ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అప్పట్లో మైనే ప్యార్ కియా(తెలుగులో ప్రేమపావురాళ్లు) ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.ఆ సినిమాతో తన నటనతో పాటు అమాయకమై చూపులతో ప్రేక్షకులను తన మాయాజాలంలో పడేసింది ఈ బ్యూటీ.
కాగా ఆ తరువాత కన్నడ, భోజ్పురి భాషల్లో సినిమాలు చేస్తూ వచ్చింది.తెలుగులో చివరగా రాజశేఖర్ నటించిన ఓంకారం సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ మళ్లీ కనిపించలేదు.
దీంతో ఇప్పుడు ప్రభాస్ సినిమాలో తల్లి పాత్రలో నటిస్తోందనే వార్తతో భాగ్యశ్రీ మరోసారి లైమ్లైట్లోకి వచ్చింది.ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుక ఈ బ్యూటీ సారీ ఆంటీ ప్రయత్నిస్తోంది.మరి ఈమెను సెకండ్ ఇన్నింగ్స్లో ఎలా ఆదరిస్తారో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.