టాలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకొని అతి తక్కువ కాలంలో ఎబ్భైకి పైగా సినిమాలు పూర్తి చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్.అయితే పూరీ జగన్నాథ్ దర్శకుడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సినిమా బద్రీ.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇక ఈ సినిమాతో టాలీవుడ్ లో హీరోలకి కమర్షియల్ ఇమేజ్ ని తీసుకొచ్చే పూరీకి కూడా ఇండస్ట్రీలో ఫ్లాట్ ఫాం దొరికింది.
ఇక ఈ సినిమా తర్వాత మరల వీరిద్దరి కాంబినేషన్ లో చాలా కాలం తర్వాత పూరీ స్టార్ దర్శకుడుగా మారిన తర్వాత వచ్చిన సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు.ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ బావజాలం ఎలా ఉంటుందో అనే విషయం ఆయన అభిమానులకి భాగా అర్ధమైంది.
ఈ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ అభిమానించే వారి సంఖ్య ఎక్కువైంది.ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయ పునాదులు వేసుకోవడానికి కారణం అని చెప్పాలి.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.మరల ఇప్పుడిప్పుడే సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.ఇప్పటికే పింక్ మూవీ రీమేక్ సెట్స్ పైకి వెళ్ళిపోయింది.మరో వైపు క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎం రత్నం నిర్మాతగా ఓ సినిమా స్టార్ట్ కాబోతుంది.ఈ నేపధ్యంలో మరల పూరీ-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సినిమా కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.
పూరీ జగన్నాథ్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ కి ఓ స్టొరీ లైన్ చెప్పాడని, అది పవన్ కి భాగా నచ్చిందని సినిమా చేద్దామని మాట ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించడానికి రెడీగా ఉన్నారని తెలుస్తుంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్న పూరీ తర్వాత పవన్ సినిమా మీద దృష్టి పెడతాడని అనుకుంటున్నారు.మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే అధికారికంగా కన్ఫర్మ్ అయ్యేంత వరకు వేచి చూడాలి.