ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం తీవ్రంగా కలకలం రేపుతోంది.అయితే ఈ ఉద్యమం ఆడవాళ్లపై జరుగుతున్నటువంటి లైంగిక వేపుధింలపై కాకుండా మగవాళ్ళపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించి ఉండడంతో ఈ విషయంపై పలువురు సినీ పెద్దలు మరియు సినీ పరిశ్రమలో తారల స్పందిస్తున్నారు.
అయితే తాజాగా ఈ విషయంపై ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీలియోన్ స్పందించారు.
ఈ సందర్భంగా సన్నీలియోన్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు అనేవి చాలా కామన్ గా ఉంటాయని అన్నారు.
అయితే ఇందులో అవకాశాల కోసం కొంతమంది సర్దుకు పోతారని, ఇష్టం లేని వారు కామ్ గా ఉండి పోతున్నారని అన్నారు.అయితే ప్రస్తుత కాలంలో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఈ లైంగిక వేధింపులను సినీ పరిశ్రమలో ఎదుర్కొంటున్నారని కాకపోతే అబ్బాయిలు ఈ విషయం గురించి బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరని అన్నారు.
అందువల్లనే అబ్బాయిలపై జరిగేటటువంటి అత్యాచారాలు లైంగిక వేధింపులు బయటకి రావని కూడా అన్నారు.
అంతేకాక అబ్బాయిలు కూడా డా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అటువంటి వారి పై చర్యలు తీసుకునేందుకు గాను ఈ విషయాలపై గళం విప్పాలని పిలుపునిచ్చారు సన్నీ లియోన్. అయితే ప్రస్తుతం సన్నీ లియోన్ తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నటిస్తోంది. అంతేగాక తమిళంలో కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది సన్నీ లియోన్.
.తాజా వార్తలు