ఒకప్పుడు టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ కొనసాగింది.అయితే ఇందులో భాగంగా వచ్చినటువంటి మహానటి చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆదరించి అలనాటి విలక్షణ నటి మరియు అందాల తార సావిత్రి గారిని మళ్లీ గుర్తు చేస్తూ అందరి చేత కంటతడి పెట్టించింది.
దీంతో విలక్షణ నటుడు మరియు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత గాథ ఆధారంగా ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు రెండు భాగాలుగా తెరకెక్కించి విడుదల చేశారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో నందమూరి నటసింహం మరియు లెజెండ్ బాలకృష్ణ బాలకృష్ణ నటించారు.
అలాగే అన్న గారి భార్య పాత్రలో విద్యాబాలన్ నటించారు.ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు.
అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన టువంటి ఈ రెండు బయోపిక్ చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి.అంతేగాక ఈ రెండు చిత్రాలను ఉన్నటువంటి బయ్యర్లకు కొంతమేర నష్టాలను కూడా తెచ్చి పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే ఈ క్రమంలో అక్కినేని నాగార్జున కూడా తన తండ్రి అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ ను తెరకెక్కించాలని అప్పట్లో ప్లాన్ చేశారు.కానీ ఎన్టీఆర్ బయోపిక్ దారుణంగా ఫ్లాప్ అవడంతో తన తండ్రి బయోపిక్ ని తెరకెక్కించే ఆలోచనలో మానుకున్నాడు నాగార్జున.
అయితే ప్రస్తుతం ఓ ప్రముఖ దర్శకుడు అక్కినేని నాగేశ్వర రావు జీవిత కథను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.కానీ అందుకు నాగార్జున మాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.ఏదేమైనప్పటికీ బాలకృష్ణ చేసినటువంటి డేర్ ని నాగార్జున ఏం చేస్తాడా అన్న సందేహంలో ఉన్నారు అక్కినేని అభిమానులు.