పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ సినిమా తెలుగు రీమేక్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ చిత్ర షూటింగ్లో పవన్ పాల్గొంటున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ సినిమాతో పవన్ రీఎంట్రీ అదిరిపోవడం ఖాయమని, బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని చిత్ర యూనిట్తో పాటు పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక పవన్ రీఎంట్రీ లిస్టులో డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్న విషయం తెలిసిందే.
తమిళ ప్రొడ్యూసర్ ఏఎం రత్నంతో పవన్ ఓ సినిమా చేస్తానని అప్పట్లోనే మాటిచ్చాడు.ఇప్పుడు ఈ సినిమాకు దర్శకుడిగా క్రిష్ను ఎంచుకోగా, పవన్ను ఇంప్రెస్ చేసిన కథతో ఆయన రెడీగా ఉన్నాడట.
ఇక ఈ సినిమాను కూడా లాంఛనంగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.
ఈ సినిమాను జనవరి 27న అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఎలాంటి హంగులు లేకుండా సింపుల్గా ఈ సినిమా ప్రారంభోతవ్సం జరగనున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ లాంఛ్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.