యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘అశ్వధ్ధామ’ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి ఛలో లాంటి సూపర్ హిట్ను అందుకోవాలని నాగశౌర్య ఆశిస్తున్నాడు.
ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఇప్పటికే జనాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.కాగా ఈ సినిమా ట్రైలర్ను అతిత్వరలో లాంఛ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ను టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చిత్ర యూనిట్ చేసింది.ఈ సినిమా ట్రైలర్ను జనవరి 23న సాయంత్రం 5.04 గంటలకు పూరీ చేత రిలీజ్ చేయిస్తున్నారు.ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రమణ తేజ తెరకెక్కించాడు.
నాగశౌర్య సరసన అందాల భామ మెహ్రీన్ పీర్జాదా హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాపై నాగశౌర్య భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
వరుస ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్న ఈ యంగ్ హీరో అశ్వధ్ధామ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.