తాజాగా టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది.
ఈ చిత్రానికి ఎఫ్ 2 చిత్రానికి దర్శకత్వం వహించిన టువంటి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా మహేష్ కి జోడీగా రష్మిక మందన్న నటించింది.అలాగే ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, నటకిరీటి రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి సంగీత, రావు రమేష్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్ల కలెక్షన్లు వసూలు చేసి మహేష్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది.దీంతో ప్రస్తుతం మహేష్ బాబు ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు.
అయితే ఒక పక్క చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు మరో పక్క తన తదుపరి చిత్రం గురించి కూడా సన్నాహాలు చేస్తున్నాడు.ఇప్పటికే తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి కథను వినిపించినట్లు తెలుస్తోంది.
అయితే ఇందులో భాగంగా మహేష్ బాబు ఓ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.ఇప్పటికే ఓ ప్రముఖ నిర్మాత కూడా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాడట.
కానీ కథ విన్నటువంటి మహేష్ బాబు ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి కొన్ని సీన్లలో మార్పులుచేర్పులు చేయవలసినదిగా వంశీ పైడిపల్లి కి సూచించాడట.దీంతో ప్రస్తుతం వంశీ పైడిపల్లి మహేష్ చెప్పినటువంటి మార్పులు చేర్పులు గురించి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ ఈ వినూత్న దర్శకుడితో మహేష్ బాబు మాఫియాడాన్ కాంబినేషన్ అంటే మరోసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు.