స్టైలిష్ స్టా్ర్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.ఈ సినిమాతో బన్నీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ తన సత్తా చాటుతున్నాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
ఓవర్సీస్లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉన్న త్రివిక్రమ్ సినిమాలకు అక్కడ మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఈ క్రమంలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాకు అక్కడి జనం నీరజనాలు పడుతున్నారు.ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్కు వారు ఫిదా అవుతున్నారు.
ఇక ఈ సినిమా ఇప్పటికే అక్కడ 3 మిలియన్ డాలర్ క్లబ్లో చేరగా, ఇప్పుడు ఆ సినిమా ఏకంగా 4 మిలియన్ డాలర్ల క్లబ్పై కన్నేసింది.
సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమా టోటల్ రన్లో 4 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది.
పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ అదనపు బలంగా మారి చిత్ర విజయంలో తోడయ్యింది.