గత ఏడాది ఎఫ్ 2 చిత్రంతో సూపర్ హిట్ దక్కించుకున్న ముద్దుగుమ్మ మెహ్రీన్.ఆ సినిమాలో హనీ ఈజ్ బెస్ట్ అంటూ నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేసింది.
ఆ సినిమా తర్వాత మెహ్రీన్ బిజీ అవుతుందని అంతా భావించారు.కాని ఆ చిత్రం సక్సెస్ ఈ అమ్మడికి పెద్దగా ఉపయోగపడింది లేదు.
ఎఫ్ 2 చిత్రం తర్వాత గత ఏడాది చాణక్య చిత్రంలో ఈ అమ్మడు చేసింది.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పర్చింది.
ఆ చిత్రం ఫ్లాప్తో మెహ్రీన్ కుదేలయ్యింది.
చాణక్య చిత్రం ఫ్లాప్ తర్వాత ఈమెకు వచ్చిన మరో మంచి ఆఫర్ ఎంత మంచివాడవురా.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్గా మెహ్రీన్ నటించిన విషయం తెల్సిందే.ఆ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.శతమానం భవతి చిత్రం స్థాయిలో సూపర్ హిట్ అవుతుందని, దాంతో తాను మళ్లీ తెలుగులో బిజీ అవుతానని మెహ్రీన్ భావించింది.కాని ఎంత మంచివాడవురా చిత్రం కూడా నిరాశ పర్చింది.
ఏమాత్రం ఆకట్టుకోని కథ మరియు కథనంతో ఎంత మంచివాడవురా చిత్రం ఉందంటూ విమర్శలు వచ్చాయి.
సంక్రాంతికి వచ్చిన చిత్రాల పోటీలో ఈ మంచి వాడు వెనుకబడ్డాడు.మెహ్రీన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం కూడా ఫ్లాప్ అవ్వడంతో ఆమె కెరీర్ ఖతం అయినట్లే అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తమిళంలో ఈమె నటించిన పటాస్ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ సినిమా కూడా ఈమెకు నిరాశనే మిగిల్చింది.తెలుగు ఇండస్ట్రీ నుండి ఈమె సర్దేసుకోవడమేనా అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.